దుబాయ్ లోని గురుద్వారాలో కరోనా వ్యాక్సిన్
- February 09, 2021
దుబాయ్: సాధారణంగా దుబాయ్ సిఖ్ టెంపుల్ వద్ద పెద్దయెత్తున ప్రత్యేక ప్రార్థనల కోసం జనం గుమికూడేవారు. కొందరు, సిక్కు సమాజం అందించే ఆహార పదార్థాల కోసం ఎదురుచూసేవారు. అలా ప్రజల సేవలో తరించిన సిక్కు సమాజం, కరోనా నేపథ్యంలో కొత్త సేవా మార్గాన్ని ఎంచుకుంది. 5 వేల మందికి సినోఫామ్ కరోనా వ్యాక్సిన్ని అందించే కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం వచ్చేవారితో సిఖ్ టెంపుల్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి విషయాల్లో స్థానిక సిక్కులు వచ్చేవారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాగా, యూఏఈలో ఇప్పటిదాకా 4.4 మిలియన్ కరోనా వ్యాక్సిన్ డోసుల్ని అందించడం జరిగింది. 16 ఏళ్ళ పైబడిన వయసున్నవారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు.




తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







