దుబాయ్ లోని గురుద్వారాలో కరోనా వ్యాక్సిన్
- February 09, 2021
దుబాయ్: సాధారణంగా దుబాయ్ సిఖ్ టెంపుల్ వద్ద పెద్దయెత్తున ప్రత్యేక ప్రార్థనల కోసం జనం గుమికూడేవారు. కొందరు, సిక్కు సమాజం అందించే ఆహార పదార్థాల కోసం ఎదురుచూసేవారు. అలా ప్రజల సేవలో తరించిన సిక్కు సమాజం, కరోనా నేపథ్యంలో కొత్త సేవా మార్గాన్ని ఎంచుకుంది. 5 వేల మందికి సినోఫామ్ కరోనా వ్యాక్సిన్ని అందించే కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం వచ్చేవారితో సిఖ్ టెంపుల్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి విషయాల్లో స్థానిక సిక్కులు వచ్చేవారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాగా, యూఏఈలో ఇప్పటిదాకా 4.4 మిలియన్ కరోనా వ్యాక్సిన్ డోసుల్ని అందించడం జరిగింది. 16 ఏళ్ళ పైబడిన వయసున్నవారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు.




తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







