యూఏఈ సందర్శకులకు మార్షియన్ ఇంక్ స్టాంప్
- February 09, 2021
దుబాయ్: యూఏఈకి వచ్చేవారికి మార్షయన్ ఇంక్ స్టాంప్ను వారి పాస్పోర్టులపై వేయడం జరుగుతోంది. యూఏఈ తరఫున హోప్ ప్రోబ్, మార్స్ ఆర్బిట్లోకి నేడు ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆ ఘనతకు గుర్తుగా ఈ ముద్రను వేస్తున్నారు అధికారులు. యూఏఈ ప్రభుత్వ మీడియా ఆఫీస్, దుబాయ్ ఎయిర్ పోర్ట్స్తో సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. అరబిక్ అలాగే ఇంగ్లీషులో ‘మీరు ఎమిరేట్స్కి వచ్చారు.. ఎమిరేట్స్, మార్స్ని ఫిబ్రవరి 9న అందుకుంటోంది’ అనే అర్థం వచ్చేలా స్టాంప్ వేస్తున్నారు. ఫిబ్రవరి 7న కూడా స్పెషల్ స్టాంప్ కొందరికి వేయడం జరిగింది. మార్షియన్ వాతావరణానికి సంబంధించిన బొమ్మ కూడా ఈ స్టాంప్ మీద వుంటుంది. 2020 జులై 20న హోప్ ప్రోబ్, మార్స్ ప్రయాణానికి బయల్దేరింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







