యూఏఈ సందర్శకులకు మార్షియన్ ఇంక్ స్టాంప్
- February 09, 2021
దుబాయ్: యూఏఈకి వచ్చేవారికి మార్షయన్ ఇంక్ స్టాంప్ను వారి పాస్పోర్టులపై వేయడం జరుగుతోంది. యూఏఈ తరఫున హోప్ ప్రోబ్, మార్స్ ఆర్బిట్లోకి నేడు ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆ ఘనతకు గుర్తుగా ఈ ముద్రను వేస్తున్నారు అధికారులు. యూఏఈ ప్రభుత్వ మీడియా ఆఫీస్, దుబాయ్ ఎయిర్ పోర్ట్స్తో సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. అరబిక్ అలాగే ఇంగ్లీషులో ‘మీరు ఎమిరేట్స్కి వచ్చారు.. ఎమిరేట్స్, మార్స్ని ఫిబ్రవరి 9న అందుకుంటోంది’ అనే అర్థం వచ్చేలా స్టాంప్ వేస్తున్నారు. ఫిబ్రవరి 7న కూడా స్పెషల్ స్టాంప్ కొందరికి వేయడం జరిగింది. మార్షియన్ వాతావరణానికి సంబంధించిన బొమ్మ కూడా ఈ స్టాంప్ మీద వుంటుంది. 2020 జులై 20న హోప్ ప్రోబ్, మార్స్ ప్రయాణానికి బయల్దేరింది.
తాజా వార్తలు
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి









