షార్జాలో ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బందికి ఇక పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి
- February 09, 2021
షార్జా:యూఏఈలోని మరో ఎమిరేట్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని సిబ్బందికి పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసింది. కోవిడ్ 19ని అడ్డుకునేందుకు యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే పలు ఎమిరేట్స్ లు తమ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి వారం పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు షార్జా కూడా అదే బాటలో పయనిస్తోంది.ఎమిరేట్ పరిధిలోని గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ రంగంలోని విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు...ప్రైవేట్లోని కొన్ని సెక్టార్ స్టాఫ్ ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏడు రోజులకు ఒకసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని, రెస్టారెంట్లు, కేఫ్ లు, సెలూన్ల వంటి ప్రైవేట్ రంగాల్లోని సిబ్బంది రెండు వారాలకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని షార్జా పాలనా యంత్రాంగం ఆదేశించింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం









