షార్జాలో ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బందికి ఇక పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి
- February 09, 2021
షార్జా:యూఏఈలోని మరో ఎమిరేట్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని సిబ్బందికి పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసింది. కోవిడ్ 19ని అడ్డుకునేందుకు యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే పలు ఎమిరేట్స్ లు తమ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి వారం పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు షార్జా కూడా అదే బాటలో పయనిస్తోంది.ఎమిరేట్ పరిధిలోని గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ రంగంలోని విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు...ప్రైవేట్లోని కొన్ని సెక్టార్ స్టాఫ్ ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏడు రోజులకు ఒకసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని, రెస్టారెంట్లు, కేఫ్ లు, సెలూన్ల వంటి ప్రైవేట్ రంగాల్లోని సిబ్బంది రెండు వారాలకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని షార్జా పాలనా యంత్రాంగం ఆదేశించింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









