కొన్ని ఖాతాలను రద్దు చేయలేం..ట్విటర్
- February 10, 2021
న్యూఢిల్లీ:ట్విటర్ భారత ప్రభుత్వ ఆదేశాలను పాక్షికంగా అమలు చేసింది. రైతుల ఆందోళనలపై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్థాన్, ఖలిస్తాన్కు చెందిన 1178 ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించగా.. ట్విటర్ మాత్రం వాటిలో కొన్నింటినే బ్లాక్ చేసినట్లు బుధవారం వెల్లడించింది. అది కూడా కేవలం ఇండియా వరకు మాత్రమే పరిమితమని, ఇతర దేశాల్లో ఆ అకౌంట్లు పని చేస్తాయని తెలిపింది.
ఇక తాము మీడియా, జర్నలిస్టులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకుల ఖాతాల జోలికి వెళ్లలేదని, అది భారత చట్టాల ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని ట్విటర్ స్పష్టం చేసింది.గళాలు స్వేచ్ఛగా తమ వాదన వినిపించడానికి తమ మైక్రోబ్లాగింగ్ ఉన్నదని, ఎవరైనా ఎలాంటి అభిప్రాయాలైనా వ్యక్తం చేసేలా తాము మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









