ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

- February 10, 2021 , by Maagulf
ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి..ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్‌ ప్రకారం..రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి ఒకరు మృతిచెందారు..ఇదే సమయంలో కరోనా నుంచి 121 మంది పూర్తిగా కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్..దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,605కు చేరుకోగా.. కరోనాబారినపడి 8,80,599 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 845 యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనాతో ఇప్పటి వరకు 7,161 మంది మృతిచెందినట్టు ప్రభుత్వం తన బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 28,418 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కరోనా టెస్ట్‌ల సంఖ్య 1,34,22,878కు చేరింది. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com