అత్యవసరమైతే తప్ప విదేశ ప్రయాణాలు వద్దు..ఒమన్ సుప్రీం కమిటీ
- February 11, 2021
మస్కట్:ఒమన్ పౌరులు, ప్రవాసీయులు అత్యవసరమైతే తప్ప దేశం విడిచి వెళ్లొద్దని సుప్రీం కమిటీ సూచించింది. మరీ ముఖ్యంగా కోవిడ్ ప్రభావిత దేశాలకు ప్రయాణాలను పూర్తిగా మానుకోవాలని కోరింది. అంతేకాదు..కోవిడ్ నియంత్రణకు ఇప్పటికే పలు దేశాలు విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించటం..ట్రావెల్ ప్రోటోకాల్ మార్గనిర్దేశకాలను ప్రకటించిన నేపథ్యంలో విదేశాలకు వెళ్తే అక్కడే చిక్కుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది. చివరికి అధికారిక పర్యటనలను కూడా వీలైనంత పరిమిత సంఖ్యకు కుదించాలని నిర్ణయించింది. ఒమన్లో కోవిడ్ ను అరికట్టేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ..ఎప్పటికప్పుడు సుల్తానేట్లోని తాజా పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. దేశీయంగా, అంతర్జాతీయంగా కోవిడ్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. సుల్తానేట్ పరిధిలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో ఆయా వ్యక్తులు, సంస్థల వివరాలు, ఫోటోలు, పేర్లతో సహా మీడియాలో పబ్లిష్ చేస్తామని హెచ్చరించింది. ఇదిలాఉంటే కోవిడ్ సంక్షోభం దేశీయంగా చిన్న, మధ్య తరహా పరిశ్రామిక రంగాలపై ప్రభావం చూపకుండా అవసరమైన వెసులుబాటు చర్యలు కొనసాగిస్తునట్లు సుప్రీం కమిటీ వెల్లడించింది. చిన్న, మధ్యా తరహా కంపెనీలకు లోన్ల వాయిదాల చెల్లింపును పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









