అత్యవసరమైతే తప్ప విదేశ ప్రయాణాలు వద్దు..ఒమన్ సుప్రీం కమిటీ
- February 11, 2021
మస్కట్:ఒమన్ పౌరులు, ప్రవాసీయులు అత్యవసరమైతే తప్ప దేశం విడిచి వెళ్లొద్దని సుప్రీం కమిటీ సూచించింది. మరీ ముఖ్యంగా కోవిడ్ ప్రభావిత దేశాలకు ప్రయాణాలను పూర్తిగా మానుకోవాలని కోరింది. అంతేకాదు..కోవిడ్ నియంత్రణకు ఇప్పటికే పలు దేశాలు విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించటం..ట్రావెల్ ప్రోటోకాల్ మార్గనిర్దేశకాలను ప్రకటించిన నేపథ్యంలో విదేశాలకు వెళ్తే అక్కడే చిక్కుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది. చివరికి అధికారిక పర్యటనలను కూడా వీలైనంత పరిమిత సంఖ్యకు కుదించాలని నిర్ణయించింది. ఒమన్లో కోవిడ్ ను అరికట్టేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ..ఎప్పటికప్పుడు సుల్తానేట్లోని తాజా పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. దేశీయంగా, అంతర్జాతీయంగా కోవిడ్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. సుల్తానేట్ పరిధిలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో ఆయా వ్యక్తులు, సంస్థల వివరాలు, ఫోటోలు, పేర్లతో సహా మీడియాలో పబ్లిష్ చేస్తామని హెచ్చరించింది. ఇదిలాఉంటే కోవిడ్ సంక్షోభం దేశీయంగా చిన్న, మధ్య తరహా పరిశ్రామిక రంగాలపై ప్రభావం చూపకుండా అవసరమైన వెసులుబాటు చర్యలు కొనసాగిస్తునట్లు సుప్రీం కమిటీ వెల్లడించింది. చిన్న, మధ్యా తరహా కంపెనీలకు లోన్ల వాయిదాల చెల్లింపును పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







