అరకు ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం...
- February 12, 2021అరకు:విశాఖపట్నం జిల్లా అరకు ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన టూరిస్ట్ బస్సు... లోయలోకి దూసుకెళ్లింది.. అనంతగిరి మండలం డముకలోని ఐదో నంబర్ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.అరకు వెళ్లిన పర్యాటకులు... తిరుగు ప్రయాణం అయిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇది హైదరాబాద్కు చెందిన టూరిస్టుల బస్సుగా చెబుతున్నారు.. స్థానికుల సమాచారంతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు...
క్షతగాత్రులను 108 సహాయంతో ఎస్.కోట ఆస్పత్రికి తరలిస్తున్నారు.అయితే, ప్రమాద సమయంలో 30 మంది పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. 8 మంది మృతిచెందగా... 20 మందికిపైగా తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదాన్ని చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. మొత్తంగా మృతులంతా హైదరాబాద్కు చెందినవారిగానే చెబుతున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ