మసీదుల వద్ద సెక్యూరిటీ పెంచిన బహ్రెయిన్

- May 29, 2015 , by Maagulf
మసీదుల వద్ద సెక్యూరిటీ పెంచిన బహ్రెయిన్

సౌదీ అరేబియాలోని అల్‌ ఖతీఫ్‌లోగల కుదీప్‌ాని ఓ మసీదులో తీవ్రవాదులు దాడి చేసిన ఘనటతో బహ్రెయిన్‌ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇంటీరియర్‌ మినిస్టర్‌ జనరల్‌ షేక్‌ రషీద్‌ బిన్‌ అబ్దుల్లా, బహ్రెయిన్‌లో మసీదులకు రక్షణ పెంచామనీ, ఎలాంటి తీవ్రవాద ఘటనలూ జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తీవ్రవాద చర్యలను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదనీ, అలాంటి చర్యలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారాయన.మసీదుల్ని నిర్వహిస్తున్నవారు రక్షణ కోసం ప్రభుత్వంతో సహకరించాలనీ, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.జఫ్పారీ ఎండోమెంట్‌ ఛైర్మన్‌ షేక్‌ మొప్‌ాసెన్‌ అలీ మాట్లాడుతూ, మహిళలు కొన్ని రోజులపాటు మసీదు వద్ద ప్రాదర్ధనలకు దూరంగా వుండాలనీ, భద్రతా ఇబ్బందుల కారణంగానే సహకరించమని కోరుతున్నట్లు చెప్పారు. 

 

--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com