మసీదుల వద్ద సెక్యూరిటీ పెంచిన బహ్రెయిన్
- May 29, 2015
సౌదీ అరేబియాలోని అల్ ఖతీఫ్లోగల కుదీప్ాని ఓ మసీదులో తీవ్రవాదులు దాడి చేసిన ఘనటతో బహ్రెయిన్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా, బహ్రెయిన్లో మసీదులకు రక్షణ పెంచామనీ, ఎలాంటి తీవ్రవాద ఘటనలూ జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తీవ్రవాద చర్యలను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదనీ, అలాంటి చర్యలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారాయన.మసీదుల్ని నిర్వహిస్తున్నవారు రక్షణ కోసం ప్రభుత్వంతో సహకరించాలనీ, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.జఫ్పారీ ఎండోమెంట్ ఛైర్మన్ షేక్ మొప్ాసెన్ అలీ మాట్లాడుతూ, మహిళలు కొన్ని రోజులపాటు మసీదు వద్ద ప్రాదర్ధనలకు దూరంగా వుండాలనీ, భద్రతా ఇబ్బందుల కారణంగానే సహకరించమని కోరుతున్నట్లు చెప్పారు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









