తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- February 17, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్‌:తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు నమోదయ్యాయి.రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం…గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు.అదే సమయంలో 150 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,950కి చేరింది.ఇప్పటివరకు మొత్తం 2,93,690 మంది కోలుకున్నారు.మృతుల సంఖ్య 1,620 గా ఉంది.తెలంగాణలో ప్రస్తుతం 1,640 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.వారిలో 641 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.GHMCలో కొత్త‌గా 26 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com