దేశం వస్తున్న ప్రయాణీకులకు 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్
- February 18, 2021
కువైట్: బ్యాన్ చేయబడిన దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు 14 రోజుల తప్పనిసరి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వుంటుందనీ, ఏ ప్రయాణీకుడూ కువైట్ మోసాఫెర్ యాప్ ద్వారా రిజిస్టర్ కాకుండా ప్రయాణించలేడని కువైట్ వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 21 తర్వాత దేశంలోకి వచ్చే ప్రతి ప్రయాణీకుడి నుంచి రెండు పిసిఆర్ టెస్టులకు సంబంధించి ఫీజుని వసూలు చేయడం జరుగుతుందనీ, ఈ మొత్తాన్ని మెసాఫెర్ యాప్ ద్వారానే ప్రయాణీకులు చెల్లించాల్సి వుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తమ సొంత ఖర్చులతోనే ప్రయాణీకులు చేసుకోవాల్సి వుంటుంది. నిషేధం లేని దేశాల నుంచి వచ్చేవారికి 7 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వుంటుంది. అది కూడా వారి సొంత ఖర్చులతోనే. కువైట్ మోసాఫెర్ లేదా బెల్సాలామా యాప్ ద్వారా క్వారంటైన్ ఏర్పాట్లు చేసుకోవాలి. పిసిఆర్ పరీక్ష 6వ రోజున చేస్తారు. టెస్టులో నెగెటివ్ వస్తే, ఏడు రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి. అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలూ ఈ నిబంధనలకు లోబడి వుండే ప్రయాణీకులకు మాత్రమే బోర్డింగ్ సౌకర్యం కల్పించాలి.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







