దేశం వస్తున్న ప్రయాణీకులకు 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్
- February 18, 2021
కువైట్: బ్యాన్ చేయబడిన దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు 14 రోజుల తప్పనిసరి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వుంటుందనీ, ఏ ప్రయాణీకుడూ కువైట్ మోసాఫెర్ యాప్ ద్వారా రిజిస్టర్ కాకుండా ప్రయాణించలేడని కువైట్ వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 21 తర్వాత దేశంలోకి వచ్చే ప్రతి ప్రయాణీకుడి నుంచి రెండు పిసిఆర్ టెస్టులకు సంబంధించి ఫీజుని వసూలు చేయడం జరుగుతుందనీ, ఈ మొత్తాన్ని మెసాఫెర్ యాప్ ద్వారానే ప్రయాణీకులు చెల్లించాల్సి వుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తమ సొంత ఖర్చులతోనే ప్రయాణీకులు చేసుకోవాల్సి వుంటుంది. నిషేధం లేని దేశాల నుంచి వచ్చేవారికి 7 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వుంటుంది. అది కూడా వారి సొంత ఖర్చులతోనే. కువైట్ మోసాఫెర్ లేదా బెల్సాలామా యాప్ ద్వారా క్వారంటైన్ ఏర్పాట్లు చేసుకోవాలి. పిసిఆర్ పరీక్ష 6వ రోజున చేస్తారు. టెస్టులో నెగెటివ్ వస్తే, ఏడు రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి. అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలూ ఈ నిబంధనలకు లోబడి వుండే ప్రయాణీకులకు మాత్రమే బోర్డింగ్ సౌకర్యం కల్పించాలి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







