పక్కా ప్రణాళికలతో వెళ్తున్న షర్మిల..
- February 20, 2021
హైదరాబాద్:పార్టీ నిర్మాణానికి పక్కా ప్రణాళికలతో వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు షర్మిల. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో లోటస్ పాండ్ నివాసంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన వారికి ఒక ప్రశ్నావళిని సంధించారు షర్మిల. రెండు జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 500 మంది నేతలు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాశారు. షర్మిల ఇచ్చిన ప్రశ్నాపత్రంలో మొత్తం 11 ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి, ఉద్యమకారులకు, తెలంగాణ సమాజానికి ఏ సమాధానం చెప్పాలనే దానిపై ప్రశ్నలు ఉన్నాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్, దూసుకొస్తున్న బీజేపీని నిలువరించడానికి ఎలాంటి వ్యూహంతో వెళ్తే బాగుంటుందో సలహాలు ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఉన్న అవకాశాలను చెప్పాలంటూ ఈ ప్రశ్నాపత్నం రూపొందించారు. సడెన్గా తీసుకున్న రాజకీయ నిర్ణయంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్నది ఇందులోని ప్రధాన ప్రశ్న. తెలంగాణకు వైఎస్ఆర్ ఏమేం చేశారు, మీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులేంటి అంటూ ప్రశ్నలు సంధించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







