బహ్రెయిన్: సోషల్ డిస్టెన్స్ పాటించని ఏడుగురికి జరిమానా
- February 21, 2021
మనామా:కోవిడ్ నిబంధనల అమలులో బహ్రెయిన్ ప్రభుత్వం కఠిన చర్యలను కొనసాగిస్తోంది. నిబంధనలు పాటించని సంస్థలతో పాటు..వ్యక్తులకు మినహాయింపు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. నిబంధనల అమలుకు సంబంధించి అధికారులు చేపట్టిన తనిఖీల్లో 437 మంది పలు నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. వాళ్లందర్నీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరలించామని వెల్లడించారు. ఉల్లంఘునుల్లో 374 మంది ఫేస్ మాస్క్ ధరించలేదని, 47 మంది ఒకే వాహనంలో పరిమితికి మించి ప్రయాణిస్తున్నట్లు అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిపోర్ట్ చేశారు. నిందితుల్లో ఏడుగురు భౌతిక దూరం పాటించలేదని, ఇద్దరు వ్యక్తులు ఎహ్తెరాజ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోలేదన్నారు. మరో ఏడుగురు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించారని వెల్లడించారు. సమాజంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత తమ బాధ్యతని...వైరస్ వ్యాప్తికి దోహదపడేలా ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా..నిబంధనలు పాటించకపోయినా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!