బహ్రెయిన్: దారికి అడ్డంగా టేబుళ్లు వేసి రెస్టారెంట్ నిర్వహణ..
- February 21, 2021
మనామా:కరోనా భయంతో రెస్టారెంట్ల నిర్వహణపై కఠిన ఆంక్షలు అమలు చేస్తుంటే బహ్రెయిన్ లోని ఓ రెస్టారెంట్ ఓనర్ మాత్రం అవేమి తనకు పట్టవన్నట్లు వ్యవహరించాడు. ఏకంగా దారికి అడ్డంగా టేబుళ్లు వేసి దర్జాగా ఆర్డర్ తీసుకుంటున్నాడు. మనామాలోని ఓ రెస్టారెంట్ నిర్వాకం ఇది. ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో టేబుళ్లు వేసి సీటింగ్ ఏర్పాటు చేయటం వచ్చిపోయే పాదచారులకు ఇబ్బందిగా మారింది. దీంతో కొందరు వ్యక్తులు రెస్టారెంట్ నిర్వహణ తీరుపై మనామా మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన మున్సిపాలిటీ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!







