బహ్రెయిన్: దారికి అడ్డంగా టేబుళ్లు వేసి రెస్టారెంట్ నిర్వహణ..

- February 21, 2021 , by Maagulf
బహ్రెయిన్: దారికి అడ్డంగా టేబుళ్లు వేసి రెస్టారెంట్ నిర్వహణ..

మనామా:కరోనా భయంతో రెస్టారెంట్ల నిర్వహణపై కఠిన ఆంక్షలు అమలు చేస్తుంటే బహ్రెయిన్ లోని ఓ రెస్టారెంట్ ఓనర్ మాత్రం అవేమి తనకు పట్టవన్నట్లు వ్యవహరించాడు. ఏకంగా దారికి అడ్డంగా టేబుళ్లు వేసి దర్జాగా ఆర్డర్ తీసుకుంటున్నాడు. మనామాలోని ఓ రెస్టారెంట్ నిర్వాకం ఇది. ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో టేబుళ్లు వేసి సీటింగ్ ఏర్పాటు చేయటం వచ్చిపోయే పాదచారులకు ఇబ్బందిగా మారింది. దీంతో కొందరు వ్యక్తులు రెస్టారెంట్ నిర్వహణ తీరుపై మనామా మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన మున్సిపాలిటీ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com