ఒమన్ ఎయిర్లో మై స్పేస్ ఆఫర్..ఎక్స్ట్రా సీట్లు బ్లాక్ చేసుకునేందుకు ఛాన్స్
- February 26, 2021
కోవిడ్ ముప్పు నుంచి ప్రయాణికులు భద్రత పొందెందుకు, సురక్షిత భావన కలిగించేందుకు ఒమన్ ఎయిన్ మై స్పేస్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా ప్రయాణికుడు తన పక్కన ఉన్న మూడు సీట్లను బ్లాక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ప్రయాణికుడు తాను బుక్ చేసుకున్న సీటుతో పాటు మూడు సీట్ల వరకు ఇతరులు కూర్చొనే అవకాశం ఉండదు. దీంతో భౌతిక దూరం పాటించేందుకు అతనికి సౌకర్యకరమైన పరిస్థితులు, విశ్వాసం కల్పించినట్లు అవుతుందని ఒమన్ ఎయిర్ వివరించింది. అయితే..మై స్పేస్ ఆఫర్లో భాగంగా ఒకటి కంటే ఎక్కువ సీట్లు ఖరీదు చేయాలంటే ఆన్లైన్ చెకిన్ సమయాల్లోనే వీలు ఉంటుందని స్పష్టం చేసింది. అంటే విమానం బయల్దేరే సమయానికి 48 గంటల నుంచి 3 గంటల ముందు వరకు ఎక్స్ట్రా సీట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









