ఒమన్ ఎయిర్లో మై స్పేస్ ఆఫర్..ఎక్స్ట్రా సీట్లు బ్లాక్ చేసుకునేందుకు ఛాన్స్
- February 26, 2021
కోవిడ్ ముప్పు నుంచి ప్రయాణికులు భద్రత పొందెందుకు, సురక్షిత భావన కలిగించేందుకు ఒమన్ ఎయిన్ మై స్పేస్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా ప్రయాణికుడు తన పక్కన ఉన్న మూడు సీట్లను బ్లాక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ప్రయాణికుడు తాను బుక్ చేసుకున్న సీటుతో పాటు మూడు సీట్ల వరకు ఇతరులు కూర్చొనే అవకాశం ఉండదు. దీంతో భౌతిక దూరం పాటించేందుకు అతనికి సౌకర్యకరమైన పరిస్థితులు, విశ్వాసం కల్పించినట్లు అవుతుందని ఒమన్ ఎయిర్ వివరించింది. అయితే..మై స్పేస్ ఆఫర్లో భాగంగా ఒకటి కంటే ఎక్కువ సీట్లు ఖరీదు చేయాలంటే ఆన్లైన్ చెకిన్ సమయాల్లోనే వీలు ఉంటుందని స్పష్టం చేసింది. అంటే విమానం బయల్దేరే సమయానికి 48 గంటల నుంచి 3 గంటల ముందు వరకు ఎక్స్ట్రా సీట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు