ఒమన్ ఎయిర్లో మై స్పేస్ ఆఫర్..ఎక్స్ట్రా సీట్లు బ్లాక్ చేసుకునేందుకు ఛాన్స్
- February 26, 2021
కోవిడ్ ముప్పు నుంచి ప్రయాణికులు భద్రత పొందెందుకు, సురక్షిత భావన కలిగించేందుకు ఒమన్ ఎయిన్ మై స్పేస్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా ప్రయాణికుడు తన పక్కన ఉన్న మూడు సీట్లను బ్లాక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ప్రయాణికుడు తాను బుక్ చేసుకున్న సీటుతో పాటు మూడు సీట్ల వరకు ఇతరులు కూర్చొనే అవకాశం ఉండదు. దీంతో భౌతిక దూరం పాటించేందుకు అతనికి సౌకర్యకరమైన పరిస్థితులు, విశ్వాసం కల్పించినట్లు అవుతుందని ఒమన్ ఎయిర్ వివరించింది. అయితే..మై స్పేస్ ఆఫర్లో భాగంగా ఒకటి కంటే ఎక్కువ సీట్లు ఖరీదు చేయాలంటే ఆన్లైన్ చెకిన్ సమయాల్లోనే వీలు ఉంటుందని స్పష్టం చేసింది. అంటే విమానం బయల్దేరే సమయానికి 48 గంటల నుంచి 3 గంటల ముందు వరకు ఎక్స్ట్రా సీట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







