ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- February 28, 2021
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 89 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 89
ఇందులో ఏజీఎం 87 (జనరల్ అడ్మినిస్ట్రేషన్ 30, టెక్నికల్ 27, అకౌంట్స్ 22, లా 8), మెడికల్ ఆఫీసర్ 2 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు పీజీ చేసి ఉండాలి. మెడికల్ ఆఫీసర్, ఏజీఎం (లా) పోస్టులకు అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000
అప్లికేషన్లు ప్రారంభం: మార్చి 1
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31
రాపరీక్ష: మే లేదా జూన్లో
వెబ్సైట్: www.fci.gov.in
తాజా వార్తలు
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి









