ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- February 28, 2021
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 89 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 89
ఇందులో ఏజీఎం 87 (జనరల్ అడ్మినిస్ట్రేషన్ 30, టెక్నికల్ 27, అకౌంట్స్ 22, లా 8), మెడికల్ ఆఫీసర్ 2 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు పీజీ చేసి ఉండాలి. మెడికల్ ఆఫీసర్, ఏజీఎం (లా) పోస్టులకు అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000
అప్లికేషన్లు ప్రారంభం: మార్చి 1
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31
రాపరీక్ష: మే లేదా జూన్లో
వెబ్సైట్: www.fci.gov.in
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







