ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- February 28, 2021
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 89 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 89
ఇందులో ఏజీఎం 87 (జనరల్ అడ్మినిస్ట్రేషన్ 30, టెక్నికల్ 27, అకౌంట్స్ 22, లా 8), మెడికల్ ఆఫీసర్ 2 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు పీజీ చేసి ఉండాలి. మెడికల్ ఆఫీసర్, ఏజీఎం (లా) పోస్టులకు అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000
అప్లికేషన్లు ప్రారంభం: మార్చి 1
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31
రాపరీక్ష: మే లేదా జూన్లో
వెబ్సైట్: www.fci.gov.in
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







