వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ
- March 01, 2021
నైపితా: ఆర్మీ నిర్బంధంలో ఉన్న మయన్మార్ ఉద్యమనేత ఆంగ్ సాన్ సూకీ ఇవాళ కోర్టు విచారణకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అయితే ఆమె ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మయన్మార్లోని ఆర్మీ.. సైనిక తిరుగుబాటుకు పాల్పడింది. ఆ దేశ అగ్రనేతలను సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సూకీ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. గుర్తు తెలియని లొకేషన్ నుంచే ఆమె కోర్టుకు వీడియో లింకు ద్వారా హాజరయ్యారు. సైనిక తిరుగుబాటు జరిగిన నాటి నుంచి ఆ దేశంలో అల్లర్లు హెచ్చుమీరాయి. ఇప్పటి వరకు ఆ నిరసనల్లో 18 మంది మృతిచెందారు. సూకీతో పాటు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన ఇతర నేతలను తక్షణమే రిలీజ్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోసం జరిగిందని, దాని వల్లే ఎన్ఎల్డీ విజయం సాధించినట్లు ఆర్మీ ఆరోపిస్తున్నది.
తాజా వార్తలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర









