కూతుర్ని కారులోనే మర్చిపోయిన తండ్రి..మృతి చెందిన చిన్నారి
- March 03, 2021
దుబాయ్:ఓ కన్నతండ్రి నిర్లక్ష్యంత తన కూతుర్ని బలితీసుకుంది.దుబాయ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల కూతుర్ని వెంటబెట్టుకొని షాపింగ్ వెళ్లిన వ్యక్తి..షాపింగ్ తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు.షాపింగ్ చేసిన వస్తువులను ఇంట్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని కూతుర్ని కోరిన అతను..ఆ వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయాడు.నీరసంగా ఉండటంతో నేరుగా బెడ్రూంలోకి వెళ్లి పడుకున్నాడు.అయితే..తన వెంట తన నాలుగేళ్ల కూతురు వస్తుందో లేదో అనే విషయాన్ని మాత్రం అతను గమనించలేదు.రెండు గంటలు గడిచిన తర్వాత చిన్నారి కనిపించటం లేదంటూ ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఇంటి ప్రాంగణంలో వెతకటం ప్రారంభించారు. షాపింగ్ తర్వాత ఇంట్లోకి రాలేదని గమనించి..వెంటనే చిన్నారి తండ్రిని అడిగారు. వెంటనే అతను కారు దగ్గరికి వెళ్లి చూసే సరికి కారులోనే ఆ పాప ప్రాణాలు కొల్పోయి ఉంది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు..తమకు రాత్రి ఏడున్నర గంటల సమయంలో సమాచారం వచ్చిందని తెలిపారు. అయితే, కారులో ఊపిరి ఆడకపోవటం వల్లే పాప మృతి చెందినట్లు మెడికల్ రిపోర్ట్ లో తేలిందని, నేరానికి పాల్పడిన దాఖలాలు ఏమి లేవని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాహనాల్లో వాళ్లను ఒంటరిగా వదిలి వెళ్లవద్దని పోలీసులు సూచించారు. ముఖ్యంగా సమ్మర్లో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







