కరోనా వ్యాక్సిన్ పై ఉధృతంగా ప్రచారం చేయాలి:టి.గవర్నర్
- March 03, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఉన్న భయాన్నితొలగించేందుకు, పూర్తి స్థాయిలో అవగాహనకల్పించేందుకు ఉధృతంగా ప్రచారం చేయాలని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాన్ అన్నారు.అలాగే రెడ్ క్రాస్సొసైటీ తెలంగాణ శాఖ కూడా జిల్లాల వారీగా భారీగా ప్రచారాన్ని చేపట్టాలని అన్నారు.ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశంలో జరుగుతోందని చెప్పారు.వ్యాక్సిన్ తయారీ, అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని గవర్నర్ తెలిపారు.అర్హులైన వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు ఇది ఎంతో మంచి అవకాశమని అన్నారు.

తెలంగాణలోని పరిస్థితులపై గవర్నర్ తమిళఙసై బుధవారం పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్భవన్ డిస్పెన్సరీ మెడికల్ అధికారులు నీలోఫర్ హాస్పిటల్ అధికారులతో సమన్వయంఓ వ్యవహరించి రాజ్భవన్లో పనిచేస్తున్న హోంగార్డ్ కూతురుకు సర్జరీ జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే రాజ్భవన్లో పనిచేస్తున్న అర్హులైన సిబ్బంది కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు పేర్లునమోదుచేసుకోవడం పట్ల గవర్నర్ వారిని అభినందించారు. రాజ్భవన్ సిబ్బంది ఇతరులకు రోల్మోడల్గా ఉండాలని అన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







