భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 05, 2021_1614920210.jpg)
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 16,838 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761కి చేరింది.ఇందులో 1,08,39,894 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,76,319 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 113 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,548కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 13,819 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.కోలుకున్న వారి సంఖ్య కంటే కొత్త కేసులు అధికంగా ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది.ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది.ఇప్పటి వరకు 1,80,05,503 మందికి వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!