కర్ఫ్యూ టైంలో మసీదులకు నడిచి వెళ్లేందుకు అనుమతి
- March 05, 2021కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించిన కువైట్ ప్రభుత్వం..మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ తీవ్రత పెరుగుతుండటంతో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొత్తం 12 గంటల పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 7 నుంచి నెల రోజుల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే..కర్ఫ్యూ సమయంలో ప్రార్థనలకు వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పించింది. మసీదుల్లో ప్రార్థనలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం..భక్తులు తమ ఇంటి దగ్గరి మాస్కులకు మాత్రమే వెళ్లాలని, వాహనాల్లో కాకుండా నడిచి వెళ్లాలని స్పష్టత ఇచ్చింది. ఫార్మసీ, కోఆపరేటీవ్ సొసైటీలు కూడా కర్ఫ్యూ సమయంలో డెలివరీ సేవలు కొనసాగించొచ్చని స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ