శ్రీకారం ట్రైలర్ విడుదల
- March 05, 2021
హైదరాబాద్:యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా 'శ్రీకారం'. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాకు కిశోర్ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. తాజాగా యువ హీరోలు నితిన్, నాని, వరుణ్ తేజ్ శ్రీకారం ట్రైలర్ను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్ లో రైతు పాత్రలో శర్వానంద్ ఆకట్టుకోగా… పాటల్లో హీరోయిన్ ప్రియాంక గ్లామర్ కనువిందు చేస్తోంది. ఈ ట్రైలర్ లో శర్వానంద్ వ్యవసాయం గురించి చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం.. సేద్యం కూడా గెలవచ్చు’ లాంటి సంభాషణలు బాగున్నాయి. మిక్కీ జె.మేయర్ సంగీతం అలరించింది. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే శర్వానంద్ పల్లెటూరుకు వచ్చి ఎందుకు వ్యవసాయం చేశాడు..? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? లాంటివి ట్రైలర్ లో సస్పెండ్ గా చూపించారు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ కాబోతోంది.
తాజా వార్తలు
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!









