శ్రీకారం ట్రైలర్ విడుదల
- March 05, 2021హైదరాబాద్:యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా 'శ్రీకారం'. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాకు కిశోర్ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. తాజాగా యువ హీరోలు నితిన్, నాని, వరుణ్ తేజ్ శ్రీకారం ట్రైలర్ను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్ లో రైతు పాత్రలో శర్వానంద్ ఆకట్టుకోగా… పాటల్లో హీరోయిన్ ప్రియాంక గ్లామర్ కనువిందు చేస్తోంది. ఈ ట్రైలర్ లో శర్వానంద్ వ్యవసాయం గురించి చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం.. సేద్యం కూడా గెలవచ్చు’ లాంటి సంభాషణలు బాగున్నాయి. మిక్కీ జె.మేయర్ సంగీతం అలరించింది. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే శర్వానంద్ పల్లెటూరుకు వచ్చి ఎందుకు వ్యవసాయం చేశాడు..? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? లాంటివి ట్రైలర్ లో సస్పెండ్ గా చూపించారు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ కాబోతోంది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ