కర్ఫ్యూ టైంలో మసీదులకు నడిచి వెళ్లేందుకు అనుమతి

- March 05, 2021 , by Maagulf
కర్ఫ్యూ టైంలో మసీదులకు నడిచి వెళ్లేందుకు అనుమతి

కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించిన కువైట్ ప్రభుత్వం..మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ తీవ్రత పెరుగుతుండటంతో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొత్తం 12 గంటల పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 7 నుంచి నెల రోజుల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే..కర్ఫ్యూ సమయంలో ప్రార్థనలకు వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పించింది. మసీదుల్లో ప్రార్థనలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం..భక్తులు తమ ఇంటి దగ్గరి మాస్కులకు మాత్రమే వెళ్లాలని, వాహనాల్లో కాకుండా నడిచి వెళ్లాలని స్పష్టత ఇచ్చింది. ఫార్మసీ, కోఆపరేటీవ్ సొసైటీలు కూడా కర్ఫ్యూ సమయంలో డెలివరీ సేవలు కొనసాగించొచ్చని స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com