కర్ఫ్యూ టైంలో మసీదులకు నడిచి వెళ్లేందుకు అనుమతి
- March 05, 2021
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించిన కువైట్ ప్రభుత్వం..మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ తీవ్రత పెరుగుతుండటంతో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొత్తం 12 గంటల పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 7 నుంచి నెల రోజుల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే..కర్ఫ్యూ సమయంలో ప్రార్థనలకు వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పించింది. మసీదుల్లో ప్రార్థనలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం..భక్తులు తమ ఇంటి దగ్గరి మాస్కులకు మాత్రమే వెళ్లాలని, వాహనాల్లో కాకుండా నడిచి వెళ్లాలని స్పష్టత ఇచ్చింది. ఫార్మసీ, కోఆపరేటీవ్ సొసైటీలు కూడా కర్ఫ్యూ సమయంలో డెలివరీ సేవలు కొనసాగించొచ్చని స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









