కర్ఫ్యూ టైంలో మసీదులకు నడిచి వెళ్లేందుకు అనుమతి
- March 05, 2021
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించిన కువైట్ ప్రభుత్వం..మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ తీవ్రత పెరుగుతుండటంతో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొత్తం 12 గంటల పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 7 నుంచి నెల రోజుల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే..కర్ఫ్యూ సమయంలో ప్రార్థనలకు వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పించింది. మసీదుల్లో ప్రార్థనలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం..భక్తులు తమ ఇంటి దగ్గరి మాస్కులకు మాత్రమే వెళ్లాలని, వాహనాల్లో కాకుండా నడిచి వెళ్లాలని స్పష్టత ఇచ్చింది. ఫార్మసీ, కోఆపరేటీవ్ సొసైటీలు కూడా కర్ఫ్యూ సమయంలో డెలివరీ సేవలు కొనసాగించొచ్చని స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







