శ్రీకారం ట్రైలర్ విడుదల
- March 05, 2021హైదరాబాద్:యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా 'శ్రీకారం'. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాకు కిశోర్ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. తాజాగా యువ హీరోలు నితిన్, నాని, వరుణ్ తేజ్ శ్రీకారం ట్రైలర్ను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్ లో రైతు పాత్రలో శర్వానంద్ ఆకట్టుకోగా… పాటల్లో హీరోయిన్ ప్రియాంక గ్లామర్ కనువిందు చేస్తోంది. ఈ ట్రైలర్ లో శర్వానంద్ వ్యవసాయం గురించి చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం.. సేద్యం కూడా గెలవచ్చు’ లాంటి సంభాషణలు బాగున్నాయి. మిక్కీ జె.మేయర్ సంగీతం అలరించింది. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే శర్వానంద్ పల్లెటూరుకు వచ్చి ఎందుకు వ్యవసాయం చేశాడు..? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? లాంటివి ట్రైలర్ లో సస్పెండ్ గా చూపించారు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ కాబోతోంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..