భారత్ లో కరోనా కేసుల వివరాలు

- March 06, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 18,327 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,92,088 కి చేరింది.ఇందులో 1,08,54,128 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,80,304  కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 108 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,656 కి చేరింది.  ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఇప్పటి వరకు 1,94,97,704 మందికి వ్యాక్సిన్ ను అందించారు.దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.98 శాతం కాగా, మరణాల రేటు 1.41 శాతంగా నమోదైంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com