గల్ఫ్ దేశాలకు 68% ఫ్లైట్స్ కేటాయింపు

- March 06, 2021 , by Maagulf
గల్ఫ్ దేశాలకు 68% ఫ్లైట్స్ కేటాయింపు

కరోనా ప్రభావంతో పలు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలిచేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ లేటెస్ట్ షెడ్యూల్ ను ప్రకటించింది ఇండియా ప్రభుత్వం. ఈ సారి విడతలో ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల నుంచి ఇండియన్లను తీసుకువచ్చేందుకు 1,350 ఫ్లైట్స్ ను షెడ్యూల్ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. మార్చి 1 నుంచి 28 వరకు ఫ్లైట్స్ ను ఆపరేట్ చేస్తామని, ఈ సమయంలో దాదాపు 2,60,000 మంది స్వదేశానికి చేరుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అయితే..మొత్తం 1,350 ఫ్లైట్స్ ని షెడ్యూల్ చేస్తే అందులో సగానికంటే ఎక్కువ జీసీసీ దేశాలకే కేటాయించారు. జీసీసీ దేశాలకు 920 ఫ్లైట్స్ ఆపరేట్ చేయనున్నారు. మొత్తం విమానాల్లో ఇది 68 శాతం. నార్త్ అమెరికా నుంచి 150 ఫ్లైట్స్, యూకే, యూరప్ నుంచి 120, అగ్నేయ ఆసియా దేశాల నుంచి 50 వందే భారత్ మిషన్ ఫ్లైట్లను నడపనున్నట్లు శ్రీవాత్సవ వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com