చోరీ కేసులో ఇండియన్ తో సహా 9 మందికి రిమాండ్
- March 07, 2021
సౌదీ: బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లి ఈజీ మనీ కోసం కక్కుర్తి పడ్డారు. విద్యుత్ పరికరాలను దొంగిలించి సొమ్ము చేసుకోబోయారు. చివరికి నేరం బటయపడి కటకటాల పాలయ్యారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులు నిందితులు అంతా ప్రవాసీయులే. 9 మంది నిందితుల్లో ఒకరు ఇండియన్ కాగా..మిగిలిన 8 మంది పాకిస్తానీయులు. నిందితులు అంతా ఓ ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం చోరీలను మార్గంగా ఎంచుకున్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల నుంచి విద్యుత్ పరికరాలు, రాగి తీగలను దొంగింలించటంతో పాటు నిర్మాణంలో భవనాల దగ్గర నిర్మాణ సామాగ్రిని చోరీ చేస్తున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. నిందితులు దొంగిలించిన వస్తువుల విలువ దాదాపు పది లక్షల రియాల్స్ అని పోలీసులు తెలిపారు. అరెస్టైన తొమ్మిది మందిని రిమాండ్ తరలించామని..పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును బదిలీ చేయాల్సి ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







