చోరీ కేసులో ఇండియన్ తో సహా 9 మందికి రిమాండ్
- March 07, 2021సౌదీ: బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లి ఈజీ మనీ కోసం కక్కుర్తి పడ్డారు. విద్యుత్ పరికరాలను దొంగిలించి సొమ్ము చేసుకోబోయారు. చివరికి నేరం బటయపడి కటకటాల పాలయ్యారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులు నిందితులు అంతా ప్రవాసీయులే. 9 మంది నిందితుల్లో ఒకరు ఇండియన్ కాగా..మిగిలిన 8 మంది పాకిస్తానీయులు. నిందితులు అంతా ఓ ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం చోరీలను మార్గంగా ఎంచుకున్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల నుంచి విద్యుత్ పరికరాలు, రాగి తీగలను దొంగింలించటంతో పాటు నిర్మాణంలో భవనాల దగ్గర నిర్మాణ సామాగ్రిని చోరీ చేస్తున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. నిందితులు దొంగిలించిన వస్తువుల విలువ దాదాపు పది లక్షల రియాల్స్ అని పోలీసులు తెలిపారు. అరెస్టైన తొమ్మిది మందిని రిమాండ్ తరలించామని..పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును బదిలీ చేయాల్సి ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి