చోరీ కేసులో ఇండియన్ తో సహా 9 మందికి రిమాండ్

- March 07, 2021 , by Maagulf
చోరీ కేసులో ఇండియన్ తో సహా 9 మందికి రిమాండ్

సౌదీ: బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లి ఈజీ మనీ కోసం కక్కుర్తి పడ్డారు. విద్యుత్ పరికరాలను దొంగిలించి సొమ్ము చేసుకోబోయారు. చివరికి నేరం బటయపడి కటకటాల పాలయ్యారు.  సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులు నిందితులు అంతా ప్రవాసీయులే. 9 మంది నిందితుల్లో ఒకరు ఇండియన్ కాగా..మిగిలిన 8 మంది పాకిస్తానీయులు. నిందితులు అంతా ఓ ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం చోరీలను మార్గంగా ఎంచుకున్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల నుంచి విద్యుత్ పరికరాలు, రాగి తీగలను దొంగింలించటంతో పాటు నిర్మాణంలో భవనాల దగ్గర నిర్మాణ సామాగ్రిని చోరీ చేస్తున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. నిందితులు దొంగిలించిన వస్తువుల విలువ దాదాపు పది లక్షల రియాల్స్ అని పోలీసులు తెలిపారు. అరెస్టైన తొమ్మిది మందిని రిమాండ్ తరలించామని..పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును బదిలీ చేయాల్సి ఉందని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com