చోరీ కేసులో ఇండియన్ తో సహా 9 మందికి రిమాండ్
- March 07, 2021
సౌదీ: బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లి ఈజీ మనీ కోసం కక్కుర్తి పడ్డారు. విద్యుత్ పరికరాలను దొంగిలించి సొమ్ము చేసుకోబోయారు. చివరికి నేరం బటయపడి కటకటాల పాలయ్యారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులు నిందితులు అంతా ప్రవాసీయులే. 9 మంది నిందితుల్లో ఒకరు ఇండియన్ కాగా..మిగిలిన 8 మంది పాకిస్తానీయులు. నిందితులు అంతా ఓ ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం చోరీలను మార్గంగా ఎంచుకున్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల నుంచి విద్యుత్ పరికరాలు, రాగి తీగలను దొంగింలించటంతో పాటు నిర్మాణంలో భవనాల దగ్గర నిర్మాణ సామాగ్రిని చోరీ చేస్తున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. నిందితులు దొంగిలించిన వస్తువుల విలువ దాదాపు పది లక్షల రియాల్స్ అని పోలీసులు తెలిపారు. అరెస్టైన తొమ్మిది మందిని రిమాండ్ తరలించామని..పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును బదిలీ చేయాల్సి ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







