శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- March 08, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో 2.3 కిలోల బంగారం లభించింది.ముందస్తు సమాచారంతో కస్టమ్స్ అధికారులు విమానాన్ని తనిఖీ చేశారు.ఈ క్రమంలో సీటు కింద ఉన్న లైఫ్ జాకెట్లో బంగారు బిస్కెట్లను గుర్తించారు.దీంతో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్నషేక్ మస్తాన్ అనే ప్రయాణికుడి వద్ద బంగారం లభ్యమైంది. పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అక్రమంగా బంగారాన్ని లోదుస్తుల్లో తరలిస్తున్న నిందితుడి మస్తాన్ని కస్టమ్ అధికారులు గుర్తించారు.నిందితుడి వద్ద ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!