శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- March 08, 2021హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో 2.3 కిలోల బంగారం లభించింది.ముందస్తు సమాచారంతో కస్టమ్స్ అధికారులు విమానాన్ని తనిఖీ చేశారు.ఈ క్రమంలో సీటు కింద ఉన్న లైఫ్ జాకెట్లో బంగారు బిస్కెట్లను గుర్తించారు.దీంతో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్నషేక్ మస్తాన్ అనే ప్రయాణికుడి వద్ద బంగారం లభ్యమైంది. పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అక్రమంగా బంగారాన్ని లోదుస్తుల్లో తరలిస్తున్న నిందితుడి మస్తాన్ని కస్టమ్ అధికారులు గుర్తించారు.నిందితుడి వద్ద ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం….17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు