75 వ స్వాతంత్య్ర వేడుకల జాతీయ కమిటీ తొలి సమావేశంలో ఏ.పీ గవర్నర్
- March 08, 2021
విజయవాడ: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ప్రధాని నేతృత్వంలో ఏర్పడిన జాతీయ కమిటీ సభ్యునిగా ఎంపికైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సోమవారం జరిగిన కమిటీ మొదటి సమావేశంలో రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 75 వ భారత స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా ఈ ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.తొలి సమావేశంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖర్జున్ ఖర్గే, లోక్ సభ మాజీ సభాపతులు మీరా కుమార్, సుమిత్రా మహాజన్ బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్దా తదితరులు ప్రసంగించారు.భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పరిగణనలోకి తీసుకోవలసిన వివిధ అంశాలపై వారు సలహాలను అందించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమాన్ని దేశ నలుమూలలకు తీసుకెళ్లడం ద్వారా తమదైన రీతిలో సహకరించిన వీరులు ఎందరో ఉన్నారని, వారి గాధలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. దేశంలోని 130 కోట్ల జనాభా కలలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వేడుకలపై దృష్టి సారించాలన్న ప్రధాని, ఐడియాస్@75, విజయాలు@75, చర్యలు@75, పరిష్కారాలు@75 అనే విభిన్న ఇతివృత్తాలతో ముందుకు సాగుదామన్నారు. నేటి తరానికి దేశ స్వేచ్ఛ కోసం పోరాడే అవకాశం రాలేదని, అయితే దేశ అభివృద్ధి కోసం కృషి చేసే అవకాశం ఇప్పుడు మనకు లభించిందని ప్రధాని అన్నారు. గతంలో అసాధ్యమని భావించిన అనేక ఆవిష్కరణలను ఇప్పడు భారతదేశం చేసి చూపగలుగుతుందన్నారు. ఈ సమావేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమన్వయ పరిచారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







