పబ్లిక్ స్కూల్స్లో వలస విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 4 నుంచి
- March 09, 2021
యూఏఈ:ఏమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్, నాన్ ఎమిరేటీ రెసిడెంట్ విద్యార్థులు (వలస విద్యార్థులు) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 2021-22 విద్యా సంవత్సరం కోసం ఈ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. 12వ గ్రేడ్ వరకు అన్ని గ్రేడ్ల విద్యార్థులకు రిజిస్ట్రేషన్ అందుబాటులో వుంటుంది. అయితే, కిండర్గార్టెన్ 1 మరియు 2కి మాత్రం ఎమిరేటీ విద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలి.అబుధాబి ఎమిరేట్కి సంబంధించి రిమోట్ ప్రాంతాల్లో నివసిస్తోన్న యూఏఈ రెసిడెంట్లకు కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.ఎమిరాతి విద్యార్థుల రిజిస్ట్రేషన్ మార్చి 7 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగుతుంది. పబ్లిక్ స్కూల్స్ తమ సామర్థ్యంలో 20 శాతం మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించాలి. రెసిడెంట్ విద్యార్థులకు ఫీజు 6,000 దిర్హాములుగా నిర్ధారించారు. కాగా, పబ్లిక్ స్కూల్స్లో ప్రవేశం కోసం విద్యార్థులు 85 శాతం పైగా మార్కులు పొందాల్సి వుంటుంది. మ్యాత్స్, అరబిక్, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో మెరుగైన మార్కుల ప్రాతిపదికగా రిజిస్ట్రేషన్లు వుంటాయి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







