పబ్లిక్ స్కూల్స్‌లో వలస విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 4 నుంచి

- March 09, 2021 , by Maagulf
పబ్లిక్ స్కూల్స్‌లో వలస విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 4 నుంచి

యూఏఈ:ఏమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్‌మెంట్, నాన్ ఎమిరేటీ రెసిడెంట్ విద్యార్థులు (వలస విద్యార్థులు) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 2021-22 విద్యా సంవత్సరం కోసం ఈ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. 12వ గ్రేడ్ వరకు అన్ని గ్రేడ్ల విద్యార్థులకు రిజిస్ట్రేషన్ అందుబాటులో వుంటుంది. అయితే, కిండర్‌గార్టెన్ 1 మరియు 2కి మాత్రం ఎమిరేటీ విద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలి.అబుధాబి ఎమిరేట్‌కి సంబంధించి రిమోట్ ప్రాంతాల్లో నివసిస్తోన్న యూఏఈ రెసిడెంట్లకు కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.ఎమిరాతి  విద్యార్థుల రిజిస్ట్రేషన్ మార్చి 7 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగుతుంది. పబ్లిక్ స్కూల్స్ తమ సామర్థ్యంలో 20 శాతం మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించాలి. రెసిడెంట్ విద్యార్థులకు ఫీజు 6,000 దిర్హాములుగా నిర్ధారించారు. కాగా, పబ్లిక్ స్కూల్స్‌లో ప్రవేశం కోసం విద్యార్థులు 85 శాతం పైగా మార్కులు పొందాల్సి వుంటుంది. మ్యాత్స్, అరబిక్, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో మెరుగైన మార్కుల ప్రాతిపదికగా రిజిస్ట్రేషన్లు వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com