ఆసియాలో టాప్-10 బీచ్ల్లో భారత్కు చెందిన మూడు బీచ్లకు స్థానం
- February 28, 2016
ఆసియాలోని టాప్-10 బీచ్ల్లో భారత్కు చెందిన మూడు బీచ్లకు స్థానం లభించింది. ప్రముఖ ట్రావెల్ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వీటిలో రెండు బీచ్లు గోవాలోనే ఉండటం గమనార్హం. గోవాలోని అగోండా, పలోలెం సహా అండమాన్లోని హేవ్లాక్ ఐలాండ్ వద్ద ఉన్న రాధానగర్ బీచ్లు టాప్-10లో చోటు సాధించాయి. 'విశాలమైన బీచ్లకు భారత్ నెలవు. పలు బీచ్లు అంతర్జాతీయంగా పేరొందాయి. 12 నెలల పాటు వివిధ యాత్రికుల అభిప్రాయాలను క్రోడీకరించి బీచ్లను ఎంపిక చేశాం' అని ట్రిప్ అడ్వైజర్ ఇండియా మేనేజర్ నికిల్ గంజూ తెలిపారు. ఈ ఏడాది ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కరీబియన్, అమెరికా, యూరప్, సౌత్ అమెరికా, లండన్లలో 343 బీచ్లు అవార్డులకు ఎంపికయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







