గ్లోబల్ కార్టింగ్ గ్రాండ్ ఫైనల్ కు ఆతిథ్యం ఇవ్వనున్న బహ్రెయిన్
- March 10, 2021బహ్రెయిన్: కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు మెగా స్పోర్ట్స్ ఈవెంట్లకు దూరంగా ఉన్న బహ్రెయిన్..ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఈవెంట్ కు వేదికగా నిలవబోతోంది. ఈ ఏడాది చివరి నెలలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వేదికగా రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ అతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నిజానికి గ్లోబల్ కార్టింగ్ గ్రాండ్ ఫైనల్ 2020లోనే జరగాల్సి ఉంది. కానీ, కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించటంతో ఫైనల్ కార్టింగ్ రేస్ వాయిదా పడింది. ఎట్టకేలకు సాధారణ పరిస్థితుల దిశగా నిర్ణయాలు తీసుకోవటంతో గ్లోబల్ కార్టింగ్ ఈవెంట్ కు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 3న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్టింగ్ రేస్ ప్రారంభం అవుతుంది. 11 వరకు ఈవెంట్ కొనసాగుతుంది. గ్లోబల్ కార్టింగ్ ఫైనల్ రేసులో 60 దేశాల నుంచి 400 మంది మేటి కార్టింగ్ డ్రైవర్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని బహ్రెయిన్ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!