గ్లోబల్ కార్టింగ్ గ్రాండ్ ఫైనల్ కు ఆతిథ్యం ఇవ్వనున్న బహ్రెయిన్
- March 10, 2021బహ్రెయిన్: కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు మెగా స్పోర్ట్స్ ఈవెంట్లకు దూరంగా ఉన్న బహ్రెయిన్..ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఈవెంట్ కు వేదికగా నిలవబోతోంది. ఈ ఏడాది చివరి నెలలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వేదికగా రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ అతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నిజానికి గ్లోబల్ కార్టింగ్ గ్రాండ్ ఫైనల్ 2020లోనే జరగాల్సి ఉంది. కానీ, కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించటంతో ఫైనల్ కార్టింగ్ రేస్ వాయిదా పడింది. ఎట్టకేలకు సాధారణ పరిస్థితుల దిశగా నిర్ణయాలు తీసుకోవటంతో గ్లోబల్ కార్టింగ్ ఈవెంట్ కు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 3న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్టింగ్ రేస్ ప్రారంభం అవుతుంది. 11 వరకు ఈవెంట్ కొనసాగుతుంది. గ్లోబల్ కార్టింగ్ ఫైనల్ రేసులో 60 దేశాల నుంచి 400 మంది మేటి కార్టింగ్ డ్రైవర్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని బహ్రెయిన్ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్