ఫేక్ రెస్టారెంట్ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తం..పోలీసుల హెచ్చరిక

- March 14, 2021 , by Maagulf
ఫేక్ రెస్టారెంట్ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తం..పోలీసుల హెచ్చరిక

యూఏఈ:ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారా? అయితే..ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే డబ్బులు చెల్లించాలని అజ్మన్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల కొందరు కేటుగాళ్లు రెస్టారెంట్ల పేరుతో నకిలీ వెబ్ సైట్లను సృష్టించి..ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తున్నారని తెలిపారు. నకిలీ వెబ్ సైట్లను నిజమే అనే భ్రమలో ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వే ద్వారా డబ్బులు చెల్లిస్తుంటారు. దీంతో కార్డు వివరాలు కేటుగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. ఆ తర్వాత వినియోగదారుల కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకుంటారని వివరించారు. అందుకే ప్రజలు రెస్టారెంట్ల నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అజ్మన్ పోలీసులు హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com