ఫేక్ రెస్టారెంట్ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తం..పోలీసుల హెచ్చరిక
- March 14, 2021
యూఏఈ:ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారా? అయితే..ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే డబ్బులు చెల్లించాలని అజ్మన్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల కొందరు కేటుగాళ్లు రెస్టారెంట్ల పేరుతో నకిలీ వెబ్ సైట్లను సృష్టించి..ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తున్నారని తెలిపారు. నకిలీ వెబ్ సైట్లను నిజమే అనే భ్రమలో ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వే ద్వారా డబ్బులు చెల్లిస్తుంటారు. దీంతో కార్డు వివరాలు కేటుగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. ఆ తర్వాత వినియోగదారుల కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకుంటారని వివరించారు. అందుకే ప్రజలు రెస్టారెంట్ల నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అజ్మన్ పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







