భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- March 15, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పైకి కదులుతూ ఆందోళన గురిచేస్తోంది..కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 26,291 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 118 మంది కరోనాబారిన పడి మృతిచెందగా.. ఇదే సమయంలో 17,455 కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది..దీంతో.. మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,85,339కు చేరగా... ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,10,07,352కి పెరిగింది.. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,19,262 యాక్టివ్ కేసులు ఉండగా..ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,58,725కు చేరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com