తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- March 15, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పైకి కిందకు కదులుతూనే ఉన్నాయి...రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం...గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 157 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..కోవిడ్‌తో మరొకరు ప్రాణాలు కోల్పోగా... ఇదే సమయంలో 166 మంది కోవిడ్‌ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,318కు పెరగగా... రికవరీ కేసుల సంఖ్య 2,97,681కు చేరింది.. ఇక, ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1,654కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేటు 96.7 శాతంగా ఉంటే..రాష్ట్రంలో 98.79 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,983 యాక్టివ్ కేపసులు ఉండగా.. అందులో 718 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు..మరోవైపు.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 38,517 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 92,38,982కు పెరిగింది. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com