కేసీఆర్‌ను కలిసిన పలువురు ఉన్నతాధికారులు

- March 15, 2021 , by Maagulf
కేసీఆర్‌ను కలిసిన పలువురు ఉన్నతాధికారులు

హైదరాబాద్‌: పదోన్నతులు పొందిన పలువురు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు సైబరాబాద్‌ కమిషనర్‌ విసి జజ్జనార్‌, సైబరాబాద్‌ అడిషనల్‌ ట్రాఫిక్‌ సీపీ అనిల్‌ కుమార్‌లకు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ర్యాంక్‌ లభించడంతో వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. అలాగే తెలంగాణ అటవీశాఖ అధికారి పీసీసీఎఫ్‌ (ఎఫ్‌సీఏ) ఆర్‌.శోభకు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ఆఫ్‌ ఫారెస్ట్స్‌ (హెడ్‌ఆఫ్‌ది ఫారెస్ట్‌ ఫోర్స్‌)గా పదోన్నతి లభించింది. ఆమె కూడా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వారిని అభినందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com