బెగ్గర్స్ తో కోవిడ్ రిస్క్..ప్రజలను హెచ్చరించిన యూఏఈ
- March 17, 2021
యూఏఈ: కోవిడ్ తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి తావిచ్చే అన్ని అవకాశాలపై దృష్టి సారించింది యూఏఈ. బెగ్గర్స్ నుంచి వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యూఏఈ పోలీసులు హెచ్చరించారు. ముష్టివాళ్లు కోవిడ్ నిబంధనలు ఏవీ పాటించరనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని, వారికి ఫేస్ మాస్కులు, గ్లౌజులు ఉండవు కనుక వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించింది. దారిలో వెళ్తున్న ప్రజలు తమపై జాలి పడేలా సెంటిమెంట్ ట్రిక్స్ ప్లే చేస్తారని, వారి దయనీయ స్థితికి జాలిపడి దానం చేయాలనే భావన మనలో కలగేలా చేస్తారని తెలిపారు. జాలితో వారికి డబ్బు, తిండి పదార్ధాలు, ఇతర వస్తువులు దానం చేసే సమయంలో ఇంటరాక్ట్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయని, ఆ సమయంలోనే వైరస్ ఇతరులకు కూడా వ్యాపించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్స్, మాల్స్ ప్రాంగణాల్లో ఎక్కువగా అడుక్కుంటూ ఉంటారు. అయితే..ప్రజలు అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటూనే..సమాజ భద్రత కోసం వారి సమాచారాన్ని 901, 80040కి ఫోన్ చేసి తమకు అందించాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







