రియాద్ లోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడులు

- March 20, 2021 , by Maagulf
రియాద్ లోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడులు

సౌదీ:సౌదీ అరేబియా రాజధాని రియాద్ లక్ష్యంగా పొరుగు దేశంలోని తిరుగుబాటుదారులు తమ దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.ఈ సారి రాజధానిలోని ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడికి తెగబడ్డారు. అయితే..ఈ డ్రోన్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదని చమురు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. దాడి కారణంగా రిఫైనరీలో చెలరేగిన మంటలు చెలరేగాయని, వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చామన్నారు. దీంతో ఆయిల్ సప్లై యధావిధిగా కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. ఇదిలాఉంటే..రియాద్ లక్ష్యంగా జరుగుతున్న దాడుల పట్ల సౌదీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలక సంస్థలు, జనావాసాలు టార్గెట్ గా తీవ్రవాదుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయన్నారు. ఆయిల్ రిఫైనరీ వంటి ప్లాంట్ లపై దాడి చేయటం అంటే అంది ఒక్క సౌదీ అరేబియాపై మాత్రమే దాడిగా చూడలేమని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్ధిక రంగం, చమురు సరఫరాపై కూడా దాని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com