ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 20, 2021అమరావతి:ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,978 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 380 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు.అదే సమయంలో 204 మంది రికవరీ అయ్యారు.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 893366కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 884094 కి చేరింది.ఇక,ఇప్పటి వరకు కరోనాతో 7189 మంది మృతిచెందారు.ప్రస్తుతం రాష్ట్రంలో 2083 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్ లో పేర్కొంది సర్కార్.ఇక దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.
రోజువారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,55,284కి చేరింది.ఇందులో 1,11,07,332 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 2,88,394 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 188 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,59,558కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్ లో 23,653 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.దేశంలో మొత్తం ఇప్పటి వరకు 4,20,63,392 మందికి వ్యాక్సిన్ ను అందించినట్టు కేంద్రం తన బులెటిన్ లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం