గల్ఫ్ కు కార్మికులను స్మగ్లింగ్ చేస్తున్న ఏజెన్సీపై సీబీఐ విచారణ జరపాలి
- March 20, 2021- మానవ అక్రమరవాణా గురించి సహ చట్టంలో ప్రశ్నించిన గల్ఫ్ బాధితుడి భార్య
- లైసెన్సు ముసుగులో జోరుగా విజిట్ వీసాల దందా
తెలంగాణ:గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుల అక్రమ దందా కారణంగా తన భర్తకు ఒక లక్ష రూపాయల విలువైన ఆరోగ్య బీమా అందకుండా పోయిందని తమకు న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన ఒక మహిళ జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించింది.
జగిత్యాలకు చెందిన తండ్రీ కొడుకులు తంగెళ్ల గంగారాం,తంగెళ్ల సత్యం లు కార్తీక్ ఇంటర్నేషనల్ అనే పేరుతో గల్ఫ్ ఉద్యోగాల రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సును అడ్డంపెట్టుకొని అమాయకులైన కార్మికులను విజిట్ వీసాలతో దుబాయ్ కి పంపిస్తూ మోసం చేస్తూమానవ అక్రమరవాణాకు పాల్పడుతున్నారని జైన గ్రామానికి చెందిన కొక్కెరకాని గంగజల ఈనెల 2న జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై సిబిసిఐడి, సిబిఐతో పోలీసు దర్యాప్తు లేదా ఇతర పరిశోధన విభాగాలతో విచారణ చేయించాలని ఆమె కోరారు.
తానూ ఇచ్చిన దరఖాస్తుపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఆమె శనివారం (20.03.2021) సమాచార హక్కు చట్టం క్రింద జిల్లా కెలెక్టర్ కార్యాలయంలో ఒక దరఖాస్తు సమర్పించారు. తమకు న్యాయం చేయాలని మరో ప్రత్యేక దరఖాస్తు కూడా చేశారు. గంగాజల వెంట పక్షవాతంతో బాధపడుతున్న ఆమె భర్త పోశన్న వారి కుమారుడు కృతిక్ నందన్ (05), కూతురు మనస్విని (02), ఆమె తండ్రి రాజలింగు ఉన్నారు.
దుబాయ్లో పక్షవాతానికి గురై సంవత్సరం క్రితం స్వదేశానికి తిరిగివచ్చిన తన భర్త కొక్కెరకాని పోశన్న ఒక లక్ష రూపాయాల విలువైన వైద్య సహాయం పొందలేకపోవడానికి కారణం ఏజెన్సీ నిర్వాహకులేనని ఆమె అన్నారు.తన భర్త వైద్య ఖర్చులు, ఇద్దరు చిన్న పిల్లల పోషణ భారంగా మారిందని ఆమె వాపోయింది.
ఇసిఆర్ పాస్ పోర్టు కలిగిన పోశన్నకు చట్టబద్దంగా రూ.10 లక్షల విలువైన 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా పాలసీ, ఒక లక్ష రూపాయల ఆరోగ్య బీమాపొందడానికి అర్హత ఉన్నదని ఆమె అన్నారు.గల్ఫ్ ఏజెన్సీ నిర్వాహకులు తమ వద్ద రూ.68 వేలు తీసుకొని పోశన్నను దుబాయ్ కి విజిట్ వీజాపై పంపి మోసం చేశారని, ఒప్పుకున్న ప్రకారం బీమా పాలసీ జారీ చేయలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్