ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 20, 2021అమరావతి:ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,978 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 380 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు.అదే సమయంలో 204 మంది రికవరీ అయ్యారు.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 893366కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 884094 కి చేరింది.ఇక,ఇప్పటి వరకు కరోనాతో 7189 మంది మృతిచెందారు.ప్రస్తుతం రాష్ట్రంలో 2083 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్ లో పేర్కొంది సర్కార్.ఇక దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.
రోజువారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,55,284కి చేరింది.ఇందులో 1,11,07,332 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 2,88,394 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 188 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,59,558కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్ లో 23,653 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.దేశంలో మొత్తం ఇప్పటి వరకు 4,20,63,392 మందికి వ్యాక్సిన్ ను అందించినట్టు కేంద్రం తన బులెటిన్ లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు