దివ్యాంగులకు స్కూటీలను అందించిన ఎమ్మెల్సీ కవిత
- March 22, 2021
హైదరాబాద్:ఆపన్నులను అందుకోవడంలో ముందుండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. విధివంచితులై దివ్యాంగులుగా మారిన ముగ్గురు యువకులకు చేయూతనిచ్చారు ఎమ్మెల్సీ కవిత. వివిధ కారణాల వల్ల దివ్యాంగులుగా మారిన కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్, మహబూబ్ నగర్ కు చెందిన నరేష్, సుల్తానాబాద్ కు చెందిన ఉమా మహేష్ లకు హైదరాబాద్ లో మూడు చక్రాల స్కూటీలను ఎమ్మెల్సీ కవిత అందజేసారు.

కరీంనగర్ జిల్లా కుమ్మర్ పల్లికి చెందిన శ్రీనివాస్ వెన్నెముక సమస్యతో బాధపడుతూ, నడవలేని స్థితిలో ఉన్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ పరిస్థితి గురించి అతని స్నేహితుడు ట్వీట్ చేశారు. ట్విట్టర్ ద్వారా శ్రీనివాస్ పరిస్థితి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, అతని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ రోజు ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో శ్రీనివాస్ కు స్కూటీని అందజేసారు.
సుల్తానాబాద్ మండలం కంఠినెపల్లి గ్రామానికి చెందిన ఉమా మహేష్, మహబూబ్ నగర్ జిల్లా మార్కెల్ గ్రామానికి చెందిన నరేష్ దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రెండు కాళ్ళూ తీవ్రంగా దెబ్బతిని, వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.ట్విట్టర్ ద్వారా ఉమా మహేష్, నరేష్ ల దీనస్థితి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, స్కూటీలు అందించి చేయూతనిచ్చారు.
ముగ్గురికి మూడు చక్రాల స్కూటీని అందించిన ఎమ్మెల్సీ కవిత, ఎలాంటి సమస్య వచ్చినా అధైర్య పడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత భరోసానిచ్చారు. సోషల్ మీడియా లో పెట్టిన విజ్ఞప్తికి వెంటనే స్పందించడంతో పాటు, సాయం అందించి అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత కి వారంతా కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా వారి అభిమానులు 30 మంది విద్యార్థులకు సైకిళ్లు, ఆరుగురు దివ్యాంగులకు స్కూటీలను అందించారు.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







