ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్..పరిష్కరించేందుకు గూగుల్ సిబ్బంది రెడీ
- March 23, 2021ఆండ్రాయిడ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ అయ్యాయి. కొంతమంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పరికరాల్లో యాప్స్ తో ఇబ్బందులు ఎదురుక్కొంటున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ సిబ్బంది పనిచేస్తోంది.
గూగుల్ వర్క్ స్పేస్ స్టేటస్ పేజీలో ఆండ్రాయిడ్ లోని జీమెయిల్ తో సమస్యలు ఉన్నట్లు గూగుల్ అంగీకరించింది. ఈ సమస్యను పరిష్కరించేవరకు వినియోగదారులు డెస్క్ టాప్ వర్షన్ వినియోగించుకోవాలని గూగుల్ సూచిస్తుంది.
ఎవరైతే ఈ సమస్యను ఎదుర్కొటున్నారో..జీమెయిల్ యాక్సెస్ చేయలేరని చెబుతోంది. అయితే త్వరలోనే అప్ డేట్ అందిస్తామని... వీలైనంత త్వరగా ఈ సమస్యను అధిగమిస్తామని గూగుల్ చెబుతోంది.
ఆండ్రాయిడ్ వర్షన్ తో ఇబ్బంది పడుతున్న వారు .. డెస్క్ టాప్ జీమెయిల్ ఇంటర్ ఫేస్ తో వాడుకోవచ్చని సూచిస్తోంది. మరోవైపు శాంసంగ్ కూడా ఈ సమస్యను దృవీకరించింది. యూజర్స్ శాంసంగ్ కొన్ని సూచనలు చేస్తోంది. దయచేసి వెబ్ వ్యూ అప్ డేట్ తీసేసి... ఆ తర్వాత ఫోన్ రిస్టార్ట్ చేయాలని శాంసంగ్ యూస్ సపోర్ట్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది.
ఆండ్రాయిడ్ యూజర్లు మార్పులు చేసుకునేందుకు ఈ సెట్టింగ్స్ ఫాలో అవ్వాలని సూచిస్తోంది. సెట్టింగ్స్ > యాప్స్> పైన మూడు చుక్కలపై క్లిక్ చేయాలి > షో సిస్టమ్ యాప్స్ క్లిక్ చేయాలి > సెర్చ్ ఫర్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ > సెలెక్ట్ అనిస్టాల్ అప్ డేట్స్ ను క్లిక్ చేయండని శాంసంగ్ పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..