ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్..పరిష్కరించేందుకు గూగుల్ సిబ్బంది రెడీ
- March 23, 2021ఆండ్రాయిడ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ అయ్యాయి. కొంతమంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పరికరాల్లో యాప్స్ తో ఇబ్బందులు ఎదురుక్కొంటున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ సిబ్బంది పనిచేస్తోంది.
గూగుల్ వర్క్ స్పేస్ స్టేటస్ పేజీలో ఆండ్రాయిడ్ లోని జీమెయిల్ తో సమస్యలు ఉన్నట్లు గూగుల్ అంగీకరించింది. ఈ సమస్యను పరిష్కరించేవరకు వినియోగదారులు డెస్క్ టాప్ వర్షన్ వినియోగించుకోవాలని గూగుల్ సూచిస్తుంది.
ఎవరైతే ఈ సమస్యను ఎదుర్కొటున్నారో..జీమెయిల్ యాక్సెస్ చేయలేరని చెబుతోంది. అయితే త్వరలోనే అప్ డేట్ అందిస్తామని... వీలైనంత త్వరగా ఈ సమస్యను అధిగమిస్తామని గూగుల్ చెబుతోంది.
ఆండ్రాయిడ్ వర్షన్ తో ఇబ్బంది పడుతున్న వారు .. డెస్క్ టాప్ జీమెయిల్ ఇంటర్ ఫేస్ తో వాడుకోవచ్చని సూచిస్తోంది. మరోవైపు శాంసంగ్ కూడా ఈ సమస్యను దృవీకరించింది. యూజర్స్ శాంసంగ్ కొన్ని సూచనలు చేస్తోంది. దయచేసి వెబ్ వ్యూ అప్ డేట్ తీసేసి... ఆ తర్వాత ఫోన్ రిస్టార్ట్ చేయాలని శాంసంగ్ యూస్ సపోర్ట్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది.
ఆండ్రాయిడ్ యూజర్లు మార్పులు చేసుకునేందుకు ఈ సెట్టింగ్స్ ఫాలో అవ్వాలని సూచిస్తోంది. సెట్టింగ్స్ > యాప్స్> పైన మూడు చుక్కలపై క్లిక్ చేయాలి > షో సిస్టమ్ యాప్స్ క్లిక్ చేయాలి > సెర్చ్ ఫర్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ > సెలెక్ట్ అనిస్టాల్ అప్ డేట్స్ ను క్లిక్ చేయండని శాంసంగ్ పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..