వీకెండ్ లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం
- March 24, 2021
ఖతార్: ఈ వారాంతంలో పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరుగుతాయని ఖతార్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే శుక్ర, శనివారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా దేశంలోని మధ్య, దక్షిణ ప్రాంతాలలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. సముద్ర ప్రాంతంలో ఆగ్నేయం నుంచి నైరుతి దిశగా నిరంతరంగా ఉష్ణ గాలులు వీయటం ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. బలమైన ఈ గాలుల వల్ల సముద్ర తీరంలో 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో అలలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే సముద్ర తీరం ఇవతల ఉన్న భూప్రాంతంలో దుమ్ముతో కూడిన గాలులు ఉంటాయని..దీనికారణంగా దృశ్యమానత 3 కిలోమీటర్లలోపు ఉంటుందని, రోడ్ల మీద కూడా దృశ్యమానత తక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనల మేరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. అయితే..ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఉంటుందని..సగటున మధ్యాహ్నానం వేళల్లో వేడిగా, రాత్రివేళల్లో వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







