వీకెండ్ లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం
- March 24, 2021
ఖతార్: ఈ వారాంతంలో పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరుగుతాయని ఖతార్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే శుక్ర, శనివారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా దేశంలోని మధ్య, దక్షిణ ప్రాంతాలలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. సముద్ర ప్రాంతంలో ఆగ్నేయం నుంచి నైరుతి దిశగా నిరంతరంగా ఉష్ణ గాలులు వీయటం ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. బలమైన ఈ గాలుల వల్ల సముద్ర తీరంలో 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో అలలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే సముద్ర తీరం ఇవతల ఉన్న భూప్రాంతంలో దుమ్ముతో కూడిన గాలులు ఉంటాయని..దీనికారణంగా దృశ్యమానత 3 కిలోమీటర్లలోపు ఉంటుందని, రోడ్ల మీద కూడా దృశ్యమానత తక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనల మేరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. అయితే..ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఉంటుందని..సగటున మధ్యాహ్నానం వేళల్లో వేడిగా, రాత్రివేళల్లో వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







