వీకెండ్ లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం
- March 24, 2021ఖతార్: ఈ వారాంతంలో పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరుగుతాయని ఖతార్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే శుక్ర, శనివారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా దేశంలోని మధ్య, దక్షిణ ప్రాంతాలలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. సముద్ర ప్రాంతంలో ఆగ్నేయం నుంచి నైరుతి దిశగా నిరంతరంగా ఉష్ణ గాలులు వీయటం ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. బలమైన ఈ గాలుల వల్ల సముద్ర తీరంలో 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో అలలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే సముద్ర తీరం ఇవతల ఉన్న భూప్రాంతంలో దుమ్ముతో కూడిన గాలులు ఉంటాయని..దీనికారణంగా దృశ్యమానత 3 కిలోమీటర్లలోపు ఉంటుందని, రోడ్ల మీద కూడా దృశ్యమానత తక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనల మేరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. అయితే..ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఉంటుందని..సగటున మధ్యాహ్నానం వేళల్లో వేడిగా, రాత్రివేళల్లో వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?