ఒమన్ లో ఈ నెల 28 నుంచి పాక్షిక లాక్డౌన్
- March 26, 2021ఒమన్ లో వైరస్ వ్యాప్తి తీవ్రత ఆందోళనకరస్థాయికి చేరింది. కోవిడ్ తో ఆస్పత్రిలో చేరుతున్న వారి తాకిడి రోజు రోజుకి పెరుగుతోంది. అలాగే ఐసీయూలోనూ కోవిడ్ పేషెంట్ల సంఖ్య ఎక్కువైంది. దురదృష్టవశాత్తు కోవిడ్ మృతుల రేటు కూడా పెరుగుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను మరింత కఠినం చేయాలని నిర్ణయించిన సుప్రీం కమిటీ..దేశవ్యాప్తంగా పాక్షిక లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను మూసివేయాలని ఆదేశించింది. కర్ఫ్యూ సమయంలో ఎవరూ బయటికి రావొద్దని, వాహనాలకు అనుమతి ఉండదని సూచించింది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 8 వరకు లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్లడించింది. కోవిడ్ కేసుల తీవ్రత ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ను పకడ్బందీగా అమలు చేయటమే తమ ముందున్న మార్గమని సుప్రీం కమిటీ పేర్కొంది. ఇక స్కూల్స్ నిర్వహణపై కూడా స్పష్టత ఇచ్చింది. దేశంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు ఏప్రిల్ 8 వరకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తాయని, అయితే..బ్లెండెడ్ లెర్నింగ్ సిస్టంకు లోబడి ఉన్న 12వ తరగతి విద్యార్ధులకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..