ఒమన్ లో ఈ నెల 28 నుంచి పాక్షిక లాక్డౌన్
- March 26, 2021
ఒమన్ లో వైరస్ వ్యాప్తి తీవ్రత ఆందోళనకరస్థాయికి చేరింది. కోవిడ్ తో ఆస్పత్రిలో చేరుతున్న వారి తాకిడి రోజు రోజుకి పెరుగుతోంది. అలాగే ఐసీయూలోనూ కోవిడ్ పేషెంట్ల సంఖ్య ఎక్కువైంది. దురదృష్టవశాత్తు కోవిడ్ మృతుల రేటు కూడా పెరుగుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను మరింత కఠినం చేయాలని నిర్ణయించిన సుప్రీం కమిటీ..దేశవ్యాప్తంగా పాక్షిక లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను మూసివేయాలని ఆదేశించింది. కర్ఫ్యూ సమయంలో ఎవరూ బయటికి రావొద్దని, వాహనాలకు అనుమతి ఉండదని సూచించింది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 8 వరకు లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్లడించింది. కోవిడ్ కేసుల తీవ్రత ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ను పకడ్బందీగా అమలు చేయటమే తమ ముందున్న మార్గమని సుప్రీం కమిటీ పేర్కొంది. ఇక స్కూల్స్ నిర్వహణపై కూడా స్పష్టత ఇచ్చింది. దేశంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు ఏప్రిల్ 8 వరకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తాయని, అయితే..బ్లెండెడ్ లెర్నింగ్ సిస్టంకు లోబడి ఉన్న 12వ తరగతి విద్యార్ధులకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







