కోవిడ్ కేర్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం..
- March 26, 2021ముంబై:ముంబైలోని బాండూప్ ప్రాంతంలోని కరోనా ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కాగా ఆసుపత్రిలో 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని 23 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రిలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు.
కాగా, ముంబైలో కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో అధికారులు ఇటీవల షాపింగ్ మాల్ను కరోనా ఆస్పత్రిగా మార్చారు. షాపింగ్ మాల్లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు