లాక్డౌన్పై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్
- March 26, 2021హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఇక లాక్ డౌన్ ఉండబోదని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.పరిశ్రమల మూసివేత కూడా ఉండబోదని..తొందరపాటు నిర్ణయాలు ఉండవన్నారు సీఎం కేసీఆర్.ప్రజలెవరూ భయపడవద్దని..పెండ్లిల కూడా జనం తగ్గించుకోవాలని సూచించారు.గతేడాది లాక్డౌన్తో ఆర్థికంగా చాలా నష్టపోయామని సీఎం కేసీఆర్ తెలిపారు.సెల్ఫ్ కంట్రోల్... సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యమని తెలిపారు.కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేయడం బాధాకరమేనని..స్కూళ్ల మూసివేత తాత్కాలికమన్నారు.కరోనా వ్యాక్సిన్ మన చేతిలో లేదని...మన వాటా మనకు వస్తుందన్నారు.ప్రధాని కూడా కరోనా వ్యాక్సిన్పై స్పష్టతతో ఉన్నారన్నారని తెలిపారు.గతేడాది లాక్డౌన్ కారణంగా సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్న సీఎం.. మాయదారి కరోనా యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందన్నారు.తక్కువ మంది అతిధులతో పెళ్లిళ్లు నిర్వహించుకోవాలని సీఎం సూచించారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…