ఏపీలో కరోనా కేసుల వివరాలు

- March 26, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.. ఇవాళ ఏకంగా వెయ్యికి చేరువగా వెళ్లాయి కరోనా పాజిటివ్ కేసులు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,604 సాంపిల్స్ పరీక్షించగా.. 984 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఇక, చిత్తూరులో ఒకరు, విశాఖపట్నంలో మరొకరు.. మృతిచెందారు. ఇదే సమయంలో 306 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,96,863కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 8,85,515కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,145 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 7,203 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 1,49,16,201 సాంపిల్స్ ని పరీక్షించినట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com